KTR: ఓటరుగా నమోదు చేసుకోండి: కేటీఆర్

  • ముసాయిదా ఓటర్ల జాబితా రేపు వెలువడనుంది
  • అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారికి సూచన
  • ట్వీట్ లో పేర్కొన్న కేటీఆర్  

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణ కార్యక్రమం రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రేపు వెలువరించనుంది. ఈ జాబితాలో తమ పేరు లేనివారు మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిండిన వారు, ఓటరు జాబితాలో పేరులేని వారు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని అనుకున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఓటర్ల జాబితాలో తమ పేరు గల్లంతైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 

More Telugu News