charan: 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు

  • ఈ నెల 26తో షూటింగ్ పూర్తి
  •  27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • సంక్రాంతికి సినిమా రిలీజ్

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ'ను రూపొందిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని కనువిందు చేయనుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేశారు.

ఈ నెల 26వ తేదీతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. అందువలన 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇదే వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, స్నేహ .. ప్రశాంత్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాతో, చరణ్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమనేది అభిమానుల మాట.

More Telugu News