saipallavi: అందరూ భానుమతి అనే పిలుస్తున్నారు: హీరోయిన్ సాయిపల్లవి

  • భానుమతి పాత్ర బాధ్యతను పెంచింది 
  • హీరోలను డామినేట్ చేయాలనుకోను 
  • షూటింగ్స్ కి లేట్ గా వస్తాననేది అబద్ధం

తెలుగు తెరపై నటన పరంగా సౌందర్య తరువాత ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయికగా సాయిపల్లవి పేరు వినిపిస్తోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పడి పడి లేచె మనసు' కూడా నటన పరంగా సాయిపల్లవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె నటనను అంతా ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ, తన పాత్ర జనంలోకి వెళ్లినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఈ సమయంలోనే 'ఫిదా' సినిమాను గురించి ప్రస్తావిస్తూ, ఆ సినిమాలో పోషించిన భానుమతి పాత్రను జనం ఇంకా మరిచిపోలేదు. నేను ఎక్కడికి వెళ్లినా 'భానుమతి' అనే పిలుస్తున్నారు. ఆ పాత్ర నా బాధ్యతను మరింత పెంచింది. నేను హీరోలను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తాను అనే విమర్శలు వున్నాయి. అలాంటిదేమీ లేదు .. నా పాత్రకి ఎంతవరకూ న్యాయం చేశానా అనే నేను చూసుకుంటాను. ఇక షూటింగుకి నేను ఆలస్యంగా వస్తాననే ప్రచారం లోను ఎంతమాత్రం నిజం లేదు" అని ఆమె స్పష్టం చేశారు.

More Telugu News