kcr: నవీన్ పట్నాయక్ నివాసానికి కేసీఆర్.. ముఖ్యమంత్రుల భేటీ

  • విమానాశ్రయం నుంచి నవీన్ పట్నాయక్ నివాసానికి వెళ్లిన కేసీఆర్
  • సాదరంగా ఆహ్వానించిన ఒడిశా ముఖ్యమంత్రి
  • ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపిన ముఖ్యమంత్రులు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అంతకు ముందు భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా నవీన్ పట్నాయక్ అధికార నివాసానికి వెళ్లారు. తన నివాసానికి వచ్చిన కేసీఆర్ కు నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు. జాతీయ స్థాయి పర్యటనలో భాగంతో ఒడిషా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించారు.

More Telugu News