janasena: గాజు గ్లాసుతో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి.. ఎన్నికల సంఘానికి థ్యాంక్స్!: పవన్ కల్యాణ్

  • జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించిన ఈసీ
  • సాధారణ పౌరుడి గుర్తింపు ఇదేనన్న పవన్
  • ట్విట్టర్ లో గాజు గ్లాసు ఫోటో అప్ లోడ్ చేసిన జనసేనాని

రానున్న ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమకు గ్లాసు గుర్తును కేటాయించిన ఈసీకి జనసేనాని పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తన చిన్నతనం నుంచి గాజు గ్లాసుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారు. మన దేశంలోని సాధారణ పౌరుడి గుర్తింపు కూడా ఇదేనని అన్నారు. అ సందర్భంగా గాజు గ్లాసు ఫొటోను అప్ లోడ్ చేశారు. మరోవైపు, గాజు గ్లాసు గుర్తుపై జనసేన కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
.

More Telugu News