kcr: శారదా పీఠం ఆశ్రమంలో మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్

  • విశాఖ శారదా పీఠంలో కేసీఆర్ పూజలు
  • కుటుంబంతో కలసి ఆశ్రమంలో భోజనాన్ని స్వీకరించిన కేసీఆర్
  • సాయంత్రం 4.30 గంటలకు భువనేశ్వర్ కు పయనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖలోని శారదా పీఠం ఆశ్రమంలో పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఆశ్రమానికి చేరుకున్న కేసీఆర్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి స్వరూపానంద ఆశీస్సులను ఆయన తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న విజయ హనుమాన్ కు, శమీ వృక్షానికి కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. కుటుంబంతో కలసి ఆశ్రమంలోనే ఆయన మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పొలిటికల్ సెక్రటరీ సుభాష్ రెడ్డిలు ఉన్నారు. సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం నుంచి ఆయన భువనేశ్వర్ కు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విశాఖకు రావడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News