జనసేనకు పార్టీ గుర్తు వచ్చేసింది.. కేటాయించిన ఎన్నికల సంఘం
- జనసేనకు ‘గాజు గ్లాసు’
- దేశవ్యాప్తంగా 29 కొత్త పార్టీలకు గుర్తుల కేటాయింపు
- శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్టు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ‘గాజు గ్లాసు’ గుర్తుతోనే బరిలోకి దిగనున్నారు. జనసేనకు ఎన్నికల సంఘం గుర్తు ప్రకటించిన వెంటనే ఆ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా జనసేన కార్యకర్తలు, అభిమానులతో ఆ విషయాన్ని పంచుకున్నారు.