Nellore District: నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. గుప్త నిధుల కోసమే అంటున్న గ్రామస్తులు!

  • మర్రిపాడు మండలం సన్నవారిపల్లెలో ఘటన
  • అర్ధరాత్రి క్షుద్రపూజలు చేస్తున్న దుండగులు
  • గుప్తనిధుల కోసమేనని గ్రామస్తుల ఆరోపణ

నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది. జిల్లాలోని మర్రిపాడు మండలం సన్నవారిపల్లె గ్రామంలో ఉన్న పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. నిమ్మకాయలు, తమలపాకులతో పాటు ఇతర పూజా సామగ్రితో ఈ ప్రాంగణంలో ఏవో క్రతువులు నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని గమనించిన గ్రామస్తులు ఆలయం వద్దకు చేరుకోవడంతో సదరు దుండగులు కారులో పరారయ్యారు.

కాగా, ఆలయంలోని గుప్త నిధుల కోసమే ఈ పూజలు చేస్తున్నారనీ, కొన్నిచోట్ల తవ్వకాలు సైతం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ మూడుసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనలు మొదలయినప్పటి నుంచి గ్రామస్తులంతా భయంభయంగా గడుపుతున్నామనీ, అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More Telugu News