రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే అభివృద్ధిలో ఆంధ్రా 25 ఏళ్లు ముందుకుపోతుంది!: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
- అనకాపల్లిలో నేడు పార్టీ కార్యాలయం ప్రారంభం
- హాజరుకానున్న రఘువీరా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
- రాహుల్ ను గెలిపించాలని కిరణ్ పిలుపు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిపిస్తే ఏపీ అభివృద్ధిలో 25 ఏళ్లు ముందుకు పోతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఈ రోజు అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకూ కార్లతో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. అనంతరం అనకాపల్లిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.