pinnelli ramakrishna reddy: ధర్నాకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

  • గురజాల డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా
  • వైసీపీ నేత నరసింహారావుపై అక్రమ కేసు పెట్టారని మండిపాటు
  • వెంటనే విడుదల చేయాలని డిమాండ్

గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ కార్యాలయం వద్ద మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. వైసీపీ నేత నరసింహారావుపై అక్రమంగా బాంబుల కేసు పెట్టారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. టీడీపీకి చెందిన వ్యక్తులే నరసింహారావు కారు కింద బాంబులు పెట్టారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసింహారావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News