జనవరి, ఫిబ్రవరి నెలల్లో హైదరాబాద్-గుంటూరు మధ్య 'సండే స్పెషల్' రైలు
- దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డీసీఎం వెల్లడి
- ఒక టూ టైర్, మూడు త్రీ టైర్, ఏడు స్లీపర్, ఐదు జనరల్ బోగీలు
- తిరుపతి-నాగర్సోల్ మధ్య కూడా ప్రత్యేక రైలు
సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో బయలుదేరి రాత్రి పదకొండు గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరిగి 11.30 గంటలకు బయలుదేరి మరునాడు తెల్లవారు జామున 4.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. అలాగే తిరుపతి-నాగర్సోల్ మధ్య కూడా ప్రత్యేక రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 07417 నంబరుగల ఈ రైలు జనవరి 4, 11, 18, 25 తేదీల్లోను, ఫిబ్రవరి 1,8, 15, 22 తేదీల్లోను నడవనుంది. అలాగే 07418 నంబరు రైలు జనవరి 5, 12, 19, 26 తేదీల్లోను, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లోను రాకపోకలు జరుపుతుంది.