Srikakulam District: శ్రీకాకుళంలో జగన్ పుట్టినరోజు వేడుకలు.. భారీ కేక్ ను కట్ చేసిన వైసీపీ అధినేత!

  • టెక్కలిలో మొదలైన ప్రజాసంకల్పయాత్ర
  • ప్రజలను కలుసుకుంటూ ముందుకెళుతున్న జగన్
  • దామోదరపురం  మీదుగా సాగనున్న పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ చీఫ్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టెక్కలి నియోజకవర్గంలోని దండుగోపాలపురం నుంచి 327వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ఈ రోజు ప్రారంభమయింది. పాదయాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. దండుగోపాలపురం నుంచి మొదలయిన పాదయాత్ర కాశీపురం మీదుగా, దామోదరపురం క్రాస్ వరకూ సాగనుంది.

మరోవైపు ఈ రోజు జగన్ తన పుట్టిన రోజును అభిమానులు, కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు దండుగోపాలపురంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను జగన్ కట్ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు జగన్ కు ఆశీర్వచనం ఇచ్చారు. కాగా, పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోని వైసీపీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

More Telugu News