Ramcharan: కంగారులో రాంచరణ్ కు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయా: లావణ్య త్రిపాఠి

  • ఫంక్షన్ లో కాస్త కంగారుగా ఉన్నాను
  • వేడుకకు విచ్చేసిన చరణ్ కు థ్యాంక్స్
  • చరణ్ రావడంతో మాలోని స్థైర్యం మరింత పెరిగింది

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, ఆదితి రావు హైదరిలు ప్రధాన పాత్రలు పోషించిన 'అంతరిక్షం' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక నిన్న అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాంచరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా వేదికపై లావణ్య మాట్లాడుతూ, అందరి గురించి ప్రస్తావించింది. కానీ, రాంచరణ్ కు ధన్యవాదాలు చెప్పడం మాత్రం మర్చిపోయిందట.

ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా లావణ్య స్పందిస్తూ, ప్రీరిలీజ్ ఫంక్షన్ లో తాను కాస్త కంగారుగా ఉన్నానని తెలిపింది. ఈ కంగారులోనే రాంచరణ్ కు ధన్యవాదాలు తెలపడం మర్చిపోయానని... వేడుకకు విచ్చేసిన చరణ్ కు థ్యాంక్స్ చెబుతున్నానని ట్వీట్ చేసింది. వేడుకకు చరణ్ హాజరుకావడం తమలోని స్థైర్యాన్ని మరింత పెంచిందని తెలిపింది.

More Telugu News