Snakes: పెథాయ్ తుపాన్ తో అవనిగడ్డలో మళ్లీ పాముల కలకలం!

  • పొలాల్లో కనిపిస్తున్న పాములు
  • రక్తపింజరలు కనిపించడంతో కొట్టి చంపిన ప్రజలు
  • మళ్లీ మొదలైన భయాందోళనలు

పెథాయ్ ముప్పు తప్పిందిగానీ, దివిసీమ వాసులకు మరో రూపంలో కష్టం ముంచుకొచ్చింది. అవనిగడ్డ ప్రాంతంలో మరోసారి పాముల కలకలం మొదలైంది. ఈ ప్రాంతంలో పాములు మళ్లీ కనిపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు.

చెరువు అనే గ్రామంలో ప్రాణాంతకమైన రక్తపింజరలు బయటకు రావడంతో ప్రజలు వాటిని కొట్టి చంపారు. ఓ రైతు తన పొలంలో తడిసిన వరి పనలను సర్దుతుండగా, ఇవి కనిపించాయి. మరోవైపు దివిసీమలోనూ పలు ప్రాంతాల్లో విషసర్పాల సంచారం అధికమైంది. రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో పలువురిని పాములు కాటు వేసిన సంగతి తెలిసిందే.

More Telugu News