Srikakulam District: పండిన పంట తుపాన్ పాలుకావడంతో పొలంలోనే కుప్పకూలిన రైతు!

  • కొసమాల ప్రాంతానికి చెందిన రైతు
  • పంట దెబ్బతినడంతో తట్టుకోలేక పోయాడు
  • గుండెపోటుకు గురై తన పొలంలోనే ప్రాణాలు విడిచాడు

పండించిన పంట పెథాయ్ తుపాన్ పాలుకావడంతో తట్టుకోలేకపోయిన ఓ రైతుకు గుండెపోటు రావడంతో పొలంలోనే కుప్పకూలిపోయిన హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కొసమాల ప్రాంతానికి చెందిన రైతు గొట్టిపల్ల చిన్నవాడు తన పంట తుపాన్ ధాటికి దెబ్బతినడంతో తట్టుకోలేకపోయాడు. తన పొలంలోని వరద నీటిని దిగువకు వదిలేస్తున్న సమయంలో గుండెపోటుకు గురైన చిన్నవాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

More Telugu News