sharwanand: రొమాంటిక్ లవ్ స్టోరీ విడుదలకి రెడీ!

  • తెరపైకి మరో రొమాంటిక్ లవ్ స్టోరీ 
  • సూర్య పాత్రలో శర్వానంద్ 
  • వైశాలి పాత్రలో సాయిపల్లవి

శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి రూపొందించిన 'పడిపడి లేచె మనసు' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ థియేటర్స్ కి వచ్చే ఆ సమయం కోసం యూత్ అంతా వెయిట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా ఈ వేడుకకి అల్లు అర్జున్ వస్తున్నాడు. ఈ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలింది. సూర్య అనే పాత్రలో శర్వానంద్ .. వైశాలి అనే పాత్రలో సాయిపల్లవి నటించారు. టీజర్ .. ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయింది. ఫీల్ వున్న ప్రేమకథ కావడంతో, హిట్ కొట్టడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

More Telugu News