rafel: రాహుల్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బీజేపీ

  • పార్లమెంటు ఉభయసభలను కుదిపేసిన రాఫెల్
  • మోదీపై నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
  • రాహుల్ పై నోటీసు ఇచ్చిన అనురాగ్ ఠాకూర్

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై లోక్ సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాఫెల్ అంశానికి సంబంధించి ఈ నోటీసును ఇచ్చారు. దీనికి ముందు ఇదే అంశానికి సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఎందుకిచ్చారంటూ నోటీసు ఇచ్చింది. రాఫెల్ అంశం ఈరోజు పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ఈ గందరగోళం మధ్యే ట్రాన్స్ జెండర్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. 

More Telugu News