taapsi: 'మాయ' దర్శకుడి నుంచి మరో హారర్ థ్రిల్లర్

  • గతంలో వచ్చిన 'మాయ' హిట్ 
  • అదే దర్శకుడి నుంచి 'గేమ్ ఓవర్'
  • ప్రధాన పాత్రలో తాప్సీ

తమిళంలో నయనతార ప్రధాన పాత్రగా 2015 వచ్చిన 'మాయ' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను 'మయూరి' పేరుతో పలకరించింది. ఇక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా అశ్విన్ శరవణన్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ఆయన తమిళంలో 'గేమ్ ఓవర్' అనే మరో హారర్ థ్రిల్లర్ ను రూపొందించాడు. తాప్సీ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తెలుగులో 'ఆనందో బ్రహ్మ' వంటి హారర్ కామెడీ .. తమిళంలో 'గంగ' వంటి హారర్ థ్రిల్లర్ సినిమాలు చేసిన అనుభవం తాప్సీకి వుంది. మరోమారు ఆమె ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతోందన్న మాట. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అశ్విన్ శరవణన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. 

  • Loading...

More Telugu News