Tirumala: రేపు తిరుమలలో ఆర్జిత సేవలతోపాటు ప్రత్యేక దర్శనాల రద్దు

  • 3 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ
  • 5.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు
  • 11.30 గంటలకు ఆలయ ద్వారాల మూసివేత

రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ.. అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. రేపు వేకువజామున 3 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ.. అనంతరం అర్చన, తోమాల సేవ నిర్వహిస్తారు. ఉదయం 5.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, 7 గంటలకు శ్రీవారి సర్వ దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు.

 అనంతరం 11 గంటలకు స్వామివారి ఆలయంలోని రాములవారి మేడలో శ్రీకృష్ణస్వామికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. 11.30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు. అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు ఆలయ ద్వారాలను శుద్ధి చేసిన అనంతరం స్వామి వారికి ఏకాంతంగా తిరుప్పావై సేవ యథాతథంగా జరుగుతుంది.
 

More Telugu News