modi: మోదీ ఒక శాడిస్ట్.. కారణం ఇదే: స్టాలిన్

  • అమెరికాలో జరిగిన హింసపై మోదీ స్పందించారు
  • గజ తుపాను బాధితులను ఓదార్చడానికి మాత్రం రాలేదు
  • అదే మహారాష్ట్రలో జరిగితే అక్కడకు స్వయంగా వెళ్లేవారు

ప్రధాని నరేంద్ర మోదీపై డీఎంకే అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీని ఒక శాడిస్ట్ గా అభివర్ణించారు. 2014లో అమెరికాలోని ఓర్లాండోలే జరిగిన హింసపై మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారని... కానీ ఇక్కడ గజ తుపానులో మరణించిన వారి కుటుంబాలను మాత్రం ఓదార్చలేదని విమర్శించారు. తమిళనాడులో జరిగింది కాబట్టి ఆయన పట్టించుకోలేదని...అదే మహారాష్ట్రలో జరిగితే స్వయంగా అక్కడకు వెళ్లేవారని తెలిపారు. అందుకే ఆయనను తాను శాడిస్ట్ అంటున్నానని చెప్పారు.

మోదీ తనకు తాను సుప్రీంకోర్టు, ఆర్బీఐ, ఐటీగా భావించుకుంటారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా ఆయన ఊహించుకోవడం లేదని, ఒక చక్రవర్తిగా ఫీలవుతున్నారని విమర్శించారు. చెన్నైలో దివంగత కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ స్టాలిన్ పైవ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, చంద్రబాబు, పినరయి విజయన్, నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరందరికీ కరుణానిధి ప్రతిమలను స్టాలిన్ అందించారు.

More Telugu News