Asaduddin Owaisi: ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఎంపిక

  • ఎంఐఎం కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో నిర్ణయం
  • అక్బరుద్దీన్ పేరును ప్రకటించిన అసదుద్దీన్
  • గత అసెంబ్లీలో కూడా ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించిన అక్బరుద్దీన్

తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం దారుస్సలాంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఒవైసీ అధ్యక్షతన సమావేశమైన పార్టీ కార్యనిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గతం అసెంబ్లీలో కూడా ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ వ్యవహరించారు. ఆయనకు అసదుద్దీన్ మరో అవకాశం కల్పించారు. 

  • Loading...

More Telugu News