Chandrababu: 'చంద్రబాబుకు చెప్పండి సారూ'... అంటూ వెంకయ్యనాయుడి ముందు వేడుకోలు!

  • హైదరాబాద్ లో 32వ పుస్తక ప్రదర్శన
  • గ్రూప్ - 2 నోటిఫికేషన్ కావాలి
  • చంద్రబాబుకు చెప్పి ఇప్పించండి
  • నిరుద్యోగి వేడుకోలు

హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా 32వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన నిన్న ప్రారంభం కాగా, ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. సభా కార్యక్రమం ముగిసిపోయే సమయంలో ఓ నిరుద్యోగి లేచి వెంకయ్యను ఉద్దేశించి, "అయ్యా..! ఆంధ్రప్రదేశ్‌ లో గ్రూప్ -2 నోటిఫికేషన్‌ విడుదల చేయమని మీరైనా చంద్రబాబు గారికి చెప్పండి సారూ" అని విన్నవించుకున్నాడు. ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు పడుతున్న బాధలు అర్థంచేసువాలని వేడుకున్నాడు. కాగా, ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ, సాహిత్య పఠనాశక్తిని పెంచుకునేందుకు పత్రికలను ఆశ్రయించాలని కోరారు.

  • Loading...

More Telugu News