Australia vs India: రెండో టెస్ట్: భారత్ కు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. ఓపెనర్లు ఔట్!

  • వెనుదిరిగిన మురళి విజయ్, రాహుల్
  • ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ, పుజారా 
  • ప్రస్తుతం జట్టు స్కోర్ 40/2

పెర్త్ స్టేడియం వేదికగా ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు మురళి విజయ్, లోకేష్ రాహుల్ ఆదిలోనే ఔట్ అయ్యి నిరాశ పరిచారు. మురళి విజయ్ డకౌట్ కాగా, రాహుల్ రెండు పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ (22), చటేశ్వర్ పుజారా (11) క్రీజ్ లో ఉండగా, జట్టు స్కోరు 40/2 గా ఉంది. కాగా, అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 326 పరుగులకి ఆలౌట్ అయింది.

More Telugu News