charan: 'వినయ విధేయ రామ' కోసం పోటీపడుతోన్న బయ్యర్లు

  • కుటుంబ నేపథ్యలో సాగే కథ  
  • హిందీ శాటిలైట్ హక్కుల డీల్ 22 కోట్లు 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు    

మెగా అభిమానులంతా ఇప్పుడు 'వినయ విధేయ రామ' పైనే దృష్టి పెట్టారు. చరణ్ .. కైరా అద్వాని జంటగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. ఇక మాస్ హీరోగా చరణ్ కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి. ఈ కారణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోందని సమాచారం.

ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కుటుంబ సభ్యుల మధ్యగల బంధాలు .. అనుబంధాలు వుంటాయి. కలిసి ఉండటంలోని కమ్మదనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతికి తగిన సినిమా ఇది. అందువలన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడానికి బయ్యర్లు పోటీపడుతున్నారట. నైజామ్ ఏరియా హక్కులు 24 కోట్లకి అమ్ముడై .. నాన్ 'బాహుబలి' రికార్డును సృష్టించాయని అంటున్నారు. ఇక హిందీ శాటిలైట్ హక్కుల డీల్ 22 కోట్లకి కుదిరినట్టుగా చెబుతున్నారు.         

More Telugu News