టీటీడీపై కేసులో హైకోర్టు తీర్పు పట్ల స్పందించిన రమణ దీక్షితులు!
- 20 వేల మంది అర్చకులకు మేలు కలుగుతుంది
- టీటీడీ నిర్ణయం తప్పని తేలింది
- హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన రమణ దీక్షితులు
కాగా, టీటీడీలో ప్రస్తుతం 52 మంది మిరాశీ అర్చకులు ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకుల్లో నలుగురు ప్రధాన అర్చకులు, ఆరుగురు అర్చకులను పదవీ విరమణ పేరుతో టీటీడీ ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ తిరుచానూరుకు చెందిన అర్చక స్వాములు హైకోర్టును ఆశ్రయించగా, కేసును విచారించిన ధర్మాసనం తీర్పిచ్చింది.