patanjali: పబ్లిక్ ఆఫర్ కు రానున్న ‘పతంజలి’?

  • ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి  
  • ఈ నెలలోనే మీరొక శుభవార్త వింటారు 
  • సూచన ప్రాయంగా సంకేతాలిచ్చిన బాబా రాందేవ్

నాడు చిన్న ఫార్మసీ సంస్థగా ప్రారంభమైన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ క్రమేపి విస్తరించింది. ఆపై ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) మార్కెట్ లోకి అడుగుపెట్టిన ‘పతంజలి’ దూసుకుపోతోంది. ఈ సంస్థ త్వరలోనే ఐపీఓకి రానున్నట్టుగా వెలువడ్డ వార్తలపై ‘పతంజలి’ వ్యవస్థాపకుడు, ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్పందించారు.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయమై మాట్లాడుతూ, ‘ఈ నెలలోనే మీరొక శుభవార్త వింటారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో పతంజలి పబ్లిక్ ఆఫర్ కు రానున్న విషయంపై రాందేవ్ సూచనప్రాయంగా సంకేతాలిచ్చినట్టయింది. 

More Telugu News