akhil: ఫస్టు సాంగ్ తో పలకరించనున్న 'మిస్టర్ మజ్ను'

  • రొమాంటిక్ హీరోగా అఖిల్
  • ఈ నెల 25వ తేదీన టీజర్ రిలీజ్ 
  • వచ్చేనెల 25న సినిమా విడుదల    

'తొలి ప్రేమ' సినిమాతో తొలి సక్సెస్ ను అందుకున్న వెంకీ అట్లూరి, తరువాత కథ కూడా ప్రేమ నేపథ్యంలోనే ఉండేలా చూసుకున్నాడు. ఆ రొమాంటిల్ లవ్ స్టోరీని 'మిస్టర్ మజ్ను' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. అఖిల్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన జోడీగా నిధి అగర్వాల్ అలరించనుంది.

ఈ సినిమా నుంచి 'ఏమైనదో' అనే ఒక సాంగ్ ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వదిలిన పోస్టర్ కూడా ఆకట్టుకునేలా వుంది. ఈ నెల 25వ తేదీన టీజర్ ను .. జనవరి 25వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు ఆశించినస్థాయి ఫలితాలను అందించకపోవడంతో, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో అఖిల్ వున్నాడు. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.     

More Telugu News