bhatti vikramarka: నా గెలుపును డబ్బుతో కొనాలని కేసీఆర్ ప్రయత్నించారు: భట్టి విక్రమార్క

  • ఎన్నికలను కేసీఆర్ కమర్షియల్ గా మార్చారు
  • డబ్బు లేకపోతే మంచివాళ్లు పోటీ చేసే పరిస్థితి లేదు
  • తెలంగాణ ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి

ఎన్నికలను కేసీఆర్ కమర్షియల్ గా మార్చారని, డబ్బు లేకపోతే మంచివాళ్లు పోటీ చేసే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధిర నుంచి పోటీ చేసి గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. డబ్బు ప్రవాహం, అధికార దుర్వినియోగం తార స్థాయికి చేరడం వల్ల తెలంగాణ ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని అన్నారు.

‘నా గెలుపును డబ్బుతో కొనాలని కేసీఆర్ ప్రయత్నించారు’ అని ఆరోపించిన ఆయన, తెలంగాణ రాష్ట్రం కొంతమంది చేతుల్లో నలిగిపోతోందని, దానిని ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తామని అన్నారు. 

More Telugu News