charan: చరణ్ తో స్టెప్పులేసేది కేథరిన్ కాదు .. ఈషా గుప్తా!

  • ఈ నెల 14న ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ 
  • 22వ తేదీ లోగా మరో డ్యూయెట్ పూర్తి 
  • సంక్రాంతికి భారీస్థాయి విడుదల    

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాకి సంబంధించి ఒక ఐటెమ్ సాంగ్ చిత్రీకరణను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ .. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన 'పబ్' సెట్లో ఈ ఐటెమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.

ఈ ఐటెమ్ సాంగ్ కోసం రకుల్ .. కాజల్ పేర్లను పరిశీలించారు. చివరికి కేథరిన్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఆ తరువాత ఏం జరిగిందో గానీ, ఈషా గుప్తా పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే ఖరారు చేశారనేది తాజా సమాచారం. చరణ్ తో కలిసి 'పబ్'లో స్టెప్పులేయనున్నది ఈ బాలీవుడ్ సుందరే. ఈ నెల 22వ తేదీలోగా నాయకా నాయికలపై మరో డ్యూయెట్ ను హైదరాబాద్ శివార్లలో చిత్రీకరించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.        

More Telugu News