Chandrababu: ఏపీ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉండదు: బొత్స సత్యనారాయణ

  • చంద్రబాబుపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది
  • ఏపీలో చంద్రబాబు ఓటమిని ఎవరూ అడ్డుకోలేరు
  • తన అవసరాల కోసమే కూటమిని బాబు వాడుకుంటున్నారు

ఏపీ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల ప్రభావం ఉండదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, ఏపీలో చంద్రబాబు ఓటమిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఢిల్లీలో ఏర్పడే కొత్త కూటమిలోనూ వైసీపీ చేరదని, ఇప్పుడు ఏర్పడుతున్న కూటమిని చంద్రబాబు తన అవసరాల కోసమే వాడుకుంటున్నారని విమర్శించారు. 

More Telugu News