Tamilnadu: ఎల్లుండి తమిళ హీరోయిన్ చాందినీ ప్రేమ వివాహం... తిరుపతిలో ఏర్పాట్లు పూర్తి

  • 'సిద్దూ ప్లస్ టూ'తో పరిచయమైన చాందినీ
  • 9 సంవత్సరాలుగా డ్యాన్స్ డైరెక్టర్ నందతో ప్రేమ
  • 12న తిరుపతిలో పెళ్లి, 16న చెన్నైలో రిసెప్షన్

తన కుమారుడు శాంతను హీరోగా భాగ్యరాజా తీసిన 'సిద్దూ ప్లస్ టూ' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన చాందినీ, డ్యాన్స్ డైరెక్టర్ నందను 12వ తేదీన ప్రేమ వివాహం చేసుకోనుంది. ఈ పెళ్లి తిరుపతిలో జరగనుండగా, పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలూ హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

'విల్‌ అంబు', 'కట్టప్పావై కానోం' తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న చాందినీ, ప్రస్తుతం 'అచ్చమిల్లై అచ్చమిలై', 'వనంగాముడి', 'డాలర్‌ దేశం' సినిమాలకు సంతకం చేసివుంది. చాలాకాలంగా నందతో ప్రేమలో ఉన్న చాందినీ, పెళ్లియిన తరువాత కూడా నటిస్తానని చెబుతోంది. తొమ్మిదేళ్ల తమ ప్రేమ తరువాత వివాహబంధంతో ఒకటి కానున్నామని చెప్పింది.

తమ పెళ్లికి స్నేహితులు, సన్నిహిత బంధువులు హాజరవుతారని, ఆపై 16న చెన్నైలోని మేయర్‌ రామనాథన్‌ మండపంలో రిసెప్షన్ ఉంటుందని వెల్లడించింది. సినిమాల్లో మంచి స్థాయిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని తాను ముందే నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది చాందినీ

More Telugu News