praja kutami: ప్రజాకూటమి నేతల సమావేశం!

  • హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సమావేశం
  • ఈ సమావేశంలో పాల్గొన్న కుంతియా, ఉత్తమ్, రమణ..
  • ఎన్నికల్లో గెలుపోటములపై చర్చ!

ప్రజాకూటమి నేతలు, తెలంగాణ పీసీసీ నేతల కోర్ కమిటీ కొద్ది సేపటి క్రితం సమావేశమైంది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి టీ- కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధినేత కోదండరామ్, కాంగ్రెస్ పార్టీ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, సీపీఐ నేతలు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై నేతలు చర్చించనున్నట్టు సమాచారం. 

More Telugu News