diya kumari: విడాకుల కోసం దరఖాస్తు చేసిన జైపూర్ రాకుమారి

  • జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తె దియా కుమారి
  • 1997లో వివాహం చేసుకున్న దియా
  • గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు

జైపూర్ రాకుమారి, సవాయి మాధోపూర్ ఎమ్మెల్యే దియా కుమారి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేస్తున్నట్టు పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. గాంధీనగర్ ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహచట్టం సెక్షన్ 13బీ కింద ఆమె పిటిషన్ వేశారు. జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తె దియా కుమారి. తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 1997లో దియా కుమారి, నరేంద్ర సింగ్ లు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో, 21 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోనున్నారు.

మరోవైపు గత ఎన్నికల్లో సవాయి మాధోపూర్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా దియా కుమారి గెలుపొందారు. రాజస్థాన్ కు ఈసారి జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయలేనని ఆమె చెప్పడంతో... ఆమె స్థానంలో ఆశా మీనాకు అవకాశం కల్పించారు. అయితే, దియా వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News