karwan: కార్వాన్ నియోజకవర్గంలో పోలింగ్ కి సంబంధించి లభ్యం కాని కొన్ని పత్రాలు!

  • రజత్ కుమార్ ను కలిసిన కొన్ని పార్టీలు
  • రీ-పోలింగ్ నిర్వహించాలని కోరిన వైనం
  • ఈ విజ్ఞప్తిని సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన రజత్ కుమార్  

కార్వాన్ నియోజకవర్గంలో పోలింగ్ కి సంబంధించి కొన్ని పత్రాలు లభ్యం కాకపోవడంతో రీ-పోలింగ్ నిర్వహించాలని కొన్ని పార్టీలు కోరారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశాయి. పార్టీలు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రజత్ కుమార్ తీసుకెళ్లారు.

కాగా, ఈ పరిస్థితిపై కార్వాన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాన కిశోర్, జిల్లా అధికారులు సమీక్షిస్తున్నారు. ఆ పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను క్రోడీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ఆధారంగా ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

More Telugu News