Guntur District: నాగార్జున వర్సిటీలో ప్రకృతి సదస్సు ప్రారంభం

  • ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
  • ఈనెల 17 వరకు 10 రోజులపాటు కొనసాగనున్న సదస్సు
  • వేలాది మంది రైతులకు శిక్షణ లక్ష్యం

సమగ్ర వ్యవసాయ విధానాలపై రైతులకు శిక్షణ అందించడం లక్ష్యంగా చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ సదస్సు శనివారం ఉదయం ప్రారంభమయింది. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఈ సదస్సును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

ఈనెల 17వ తేదీ వరకు పది రోజుపాటు జరిగే ఈ సదస్సులో రైతులకు వ్యవసాయ అంశాలపై శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.

More Telugu News