narayana: 11వ తేదీ వరకు సంతోషించే హక్కు కేటీఆర్ కు ఉంది: నారాయణ

  • పోలింగ్ శాతాన్ని చూస్తే ప్రజాకూటమిదే విజయం
  • టీఆర్ఎస్ కు పోలీసులు, ఎన్నికల అధికారులు సహకరించారు
  • బీజేపీ ప్రచారం టీఆర్ఎస్ కోసం చేసినట్టు ఉంది

గెలుపు టీఆర్ఎస్ దే అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. గెలుపు మాదే అంటూ 11వ తేదీ వరకు సంతోషించే హక్కు కేటీఆర్ కు ఉందని ఆయన అన్నారు. ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని చూస్తే గెలుపు ప్రజాకూటమిదే అనే ధీమాను వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ నేతలకు పోలీసులు, ఎన్నికల అధికారులు బరితెగించి సహకరించారని... తనిఖీల్లో పట్టుబడిన కోట్లాది రూపాయల డబ్బును ప్రజాకూటమి సొమ్ముగా అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వేరే దేశం నుంచి వచ్చినట్టుగా బీజేపీ నేతలు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇంత చేసినా చివరకు ప్రజాకూటమినే విజయం వరించబోతోందని చెప్పారు. 

More Telugu News