TRS: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్.. ‘సీఎన్ఎన్- న్యూస్ 18’ సర్వేలో టీఆర్ఎస్ దే అగ్రస్థానం!

  • టీఆర్ఎస్ కు 50-65  
  • ప్రజాకూటమికి 38-52
  • బీజేపీకి 4-7, ఇతరులకు 8-14 స్థానాలు

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్  వెలువడ్డాయి. ‘సీఎన్ఎన్ - న్యూస్ 18’ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కే ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నట్టు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం... టీఆర్ఎస్ కు 50-65 స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడింది. ప్రజాకూటమికి 38-52, బీజేపీకి 4-7, ఇతరులకు 8-14 స్థానాలు వచ్చే అవకాశమున్నట్టు తెలిపింది. కాగా, తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
 

More Telugu News