hyderabad: రిగ్గింగ్ ఆరోపణలు.. పాతబస్తీలోని యాకుత్ పురాలో ఘర్షణ!

  •   ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల పరస్పర ఆరోపణలు
  • అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది
  • పోలీసుల అదుపులో ఘర్షణకు పాల్పడ్డ కార్యకర్తలు

రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో పాతబస్తీలోని యాకుత్ పురాలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది ఘర్షణకు పాల్పడ్డ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్ పురా, యాకుత్ పురాలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. రాజకీయపార్టీలకు చెందిన వారు, బయట వ్యక్తుల నుంచి తమకు ఫిర్యాదులు అందిన వెంటనే వాటిపై దృష్టి సారించామని చెప్పారు. ఎక్కడా రిగ్గింగ్ జరగడం లేదని, ప్రజలు వచ్చి తమ ఓట్లు వేసి వెళుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News