siddhipet: చింతమడకలో ఓటేయనున్న కేసీఆర్..భారీ బందోబస్తు ఏర్పాటు

  • రేపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
  • సిద్ధిపేట జిల్లాలో ఉన్న చింతమడక గ్రామం
  • హెలీప్యాడ్ స్థలాన్ని, పోలింగ్ బూత్ ను పరిశీలించిన అధికారులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిద్ధిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలోని పోలింగ్ బూత్ లో సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు కేసీఆర్ అక్కడికి వెళ్లనుండటంతో హెలిప్యాడ్ స్థలాన్ని, పోలింగ్ బూత్ ను పోలీస్ అధికారులు ఈరోజు పరిశీలించారు. అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News