dhanush: 'మారి 2' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది

  • ధనుశ్ హీరోగా 'మారి 2'
  • రేపు రిలీజ్ కానున్న ట్రైలర్
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల       

ధనుశ్ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'మారి' భారీ విజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ కి చాలా రోజుల క్రితమే ప్లాన్ చేశారు. పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగును చకచకా పూర్తి చేసేశారు. ధనుశ్ సొంత బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాకి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించాడు.

సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచే ఉద్దేశంతో టీమ్ వుంది. 'మారి' సినిమాను అప్పట్లో 'మాస్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 'మారి 2' సినిమా తెలుగులో 'మాస్ 2' పేరుతో విడుదలయ్యే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుందనీ, తనకి మరో హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ధనుశ్ వున్నాడు.        

More Telugu News