janasena: జన సైనికుల మృతి ఘటనపై పవన్ తీవ్ర మనస్తాపం

  • ఈరోజు సాయంత్రం సంతాపసభ 
  • ముందుగా అనుకున్న ‘జనసేన తరంగం’ రేపటికి వాయిదా
  • ‘ట్విట్టర్’లో జనసేన పార్టీ  ప్రకటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న అనంతపురంలో నిర్వహించిన కవాతు, బహిరంగ సభకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న నలుగురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఓ ప్రకటనలో పార్టీ పేర్కొంది.

ఈ రోజు సాయంత్రం నిర్వహించే సంతాపసభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నట్టు పేర్కొంది. సంతాప సభ నేపథ్యంలో ముందుగా అనుకున్న ‘జనసేన తరంగం’ ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమం రేపటికి వాయిదా వేస్తున్నట్టు జనసేన పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News