saipallavi: సాయిపల్లవి అంటే అంతే మరీ .. నో చెప్పేసిందట!

  • కథకే మొదటి ప్రాధాన్యత 
  • పాత్ర ప్రాముఖ్యత చూసే సాయిపల్లవి 
  • పెద్ద సినిమా అయినా తన పద్ధతి అంతే

తెలుగులో నటన పరంగా క్రేజ్ తెచ్చుకున్న కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుంది. కథ తనకి బాగా నచ్చితేనే ఆమె ఓకే చెబుతుంది. కథ నచ్చలేదు అంటే స్టార్ హీరో సినిమా అయినా .. పారితోషికం ఎక్కువగా ఇస్తామన్నా ఆమె చేయదు. ఆమెలోని ఈ లక్షణమే ఆమెకి మరింత మంది అభిమానులను చేసింది.

అలాగే తాజాగా కథ నచ్చని కారణంగా ఆమె ఒక దర్శకుడికి 'నో' చెప్పేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'ఉయ్యాలా జంపాలా' .. 'మజ్ను' వంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన విరించి వర్మ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కల్యాణ్ రామ్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించారట. అయితే తన పాత్రకి తగినంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె 'నో' చెప్పేసిందట. ఇక ఆ ఛాన్స్ ఏ హీరోయిన్ కి లభిస్తుందో చూడాలి.     

More Telugu News