Adilabad District: ఖానాపూర్ స్పెషాలిటీ: ఆమెపై... గతంలో కొడుకు.. ఇప్పుడు తండ్రి పోటీ!

  • ఇది టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ స్థానం
  • తాజా మాజీ ఎమ్మెల్యేపై గత ఎన్నికల్లో టీడీపీ తరపున రితేష్‌ రాథోడ్‌ పోటీ
  • ఈ ఎన్నికల్లో ఆమెపై రితేష్‌ తండ్రి రమేష్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ తరపున పోటీ

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు సహజం. స్నేహితులే ప్రత్యర్థులుగా మారడం, శత్రువులే చెట్టాపట్టాలేసుకుని తిరగడం, కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా బరిలో ఉండడం...ఇలా ఎన్నో విశేషాలుంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌ నియోజకవర్గంలో ముందస్తు ఎన్నికల్లో అటువంటి విశేషమే చోటు చేసుకుంది.

 ఆ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖానాయక్‌కు గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా రితేష్‌ రాథోడ్‌ నిలవగా, ఈ ఎన్నికల్లో ఆయన తండ్రి రమేష్‌ రాథోడ్‌ బరిలో ఉండడం విశేషం. మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ నియోజకవర్గంలో అసలు పోరు మాత్రం రేఖానాయక్‌, రమేష్‌ రాథోడ్‌ మధ్యే నెలకొంది.

మాజీ ఎంపీ అయిన రమేష్‌ రాథోడ్‌ 2014లో జరిగిన ఎన్నికల్లో బరిలో నివలేదు. ఆ ఎన్నికల్లో ఆయన కొడుకు రితేష్‌ రాథోడ్‌ టీడీపీ అభ్యర్థిగా రేఖానాయక్‌తో పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో రేఖానాయక్‌ దాదాపు 38 వేల ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఏకంగా రమేష్‌ రాథోడ్‌ బరిలో ఉండడం విశేషం.

More Telugu News