Ravela Kishore Babu: నాడు పవన్‌ను విమర్శించి నేడు ఆయన పంచనే ఎందుకు చేరావు?: రావెలపై మంత్రి జవహర్‌ ఫైర్‌

  • ఇప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని ప్రశ్న
  • జనసేన అధినేత వద్ద దాన్ని ఎంతకు తాకట్టుపెట్టావో చెప్పు
  • పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ ఓనమాలు తెలియవని వ్యాఖ్య

జనసేన తీర్థం పుచ్చుకుని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు కురిపించిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబుపై ఏపీ మంత్రి జవహర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన సందర్భంగా పవన్ కల్యాణ్ పై చేసిన విమర్శలు మర్చిపోయావా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆత్మగౌరవం, అధికారాలు అంటూ మాట్లాడుతున్న రావెల, పవన్‌ కల్యాణ్‌కు దాన్ని ఎంతకు తాకట్టు పెట్టారో వెల్లడించాలని కోరారు.

రాజమహేంద్రవరంలో మంత్రి మాట్లాడుతూ మంత్రి పదవి ఇచ్చినా చంద్రబాబు అధికారాలు ఇవ్వలేదని రావెల వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాజకీయ ఓనమాలు తెలియని పవన్‌ కల్యాణ్‌తో ప్రయాణించి ఆయన ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అంబేడ్కర్‌, పూలేకు తాను వారసుడినని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకుంటున్నారని, దార్శనికులైన వారి సరసన పవన్‌ ఎప్పటికీ చేరలేరన్నారు. పవన్‌కు తన ఆశయాలు నెరవేర్చాలన్న తపన ఉంటే టీడీపీతో జతకట్టడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

More Telugu News