Telangana: తెలంగాణలో రాజకీయపరమైన ఎస్ఎంఎస్, బల్క్ మెసేజ్ లపై ఆంక్షలు!

  • ఎన్నికలకు మరో 5 రోజుల సమయం
  • రాజకీయ పరమైన మెసేజ్ లపై నిషేధం
  • రెండు రోజుల పాటు అమలు

తెలంగాణలో ఎన్నికలకు మరో 5 రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ పరమైన ఎస్ఎంఎస్ లు, బల్క్ మెసేజ్ లపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎస్ఎంఎస్ లు, బల్క్ మెసేజ్ లను నిషేధిస్తున్నామని, ఈ ఆదేశాలు డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన క్షణం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ అమలులో ఉంటాయని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా బల్క్ ఎస్ఎంఎస్ లను పంపించే సంస్థలపై చట్ట పరమైన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది.

More Telugu News