Jagtial District: మహాకూటమి ప్రభావం అంతంతే : కోరుట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విద్యాసాగర్‌రావు

  • కేసీఆర్‌ కోరుట్లను రెవెన్యూ డివిజన్‌ చేస్తానన్నారు
  • మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల్లో రూ.వంద కోట్లు ఖర్చు చేశారు
  • నా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు

మహాకూటమి ప్రభావం నియోజకవర్గంలో అంతంతేనని, తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీలను వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా కూడా చేయనున్నట్లు కేసీఆర్‌ హామీ ఇచ్చారని వెల్లడించారు.

More Telugu News