ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కూకట్ పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు
- మాధవరం కృష్ణారావుపై భూకబ్జా ఆరోపణలు
- తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న మాధవరం
- సుహాసిని చుట్టూ ఉన్నవారు ముందు భూకబ్జాలను ఆపేయాలంటూ సూచన
భూకబ్జాలకు తాను పాల్పడినట్టు నిరూపిస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. టీడీపీ అభ్యర్థి సుహాసిని చుట్టూ ఉన్న నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ముందు వారు భూకబ్జాలకు పాల్పడటం ఆపాలని సూచించారు. తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని... నిరూపితం కాకపోతే ఆరోపణలు చేసిన వారు తప్పుకోవాలని అన్నారు.