Raghuveera reddy: ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఒక రోజు పట్టింది.. చంద్రబాబు-రాహుల్ కలయికపై రఘువీరారెడ్డి

  • ఒంటరిగా పోటీ చేస్తే 40-50 సీట్లు కూడా రావు
  • రాహుల్ నిర్ణయమే ఫైనల్
  • ఒంటరిగా వెళ్లేందుకు కూడా రెడీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు-కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తొలిసారి కలుసుకున్నప్పుడు తాను షాక్‌కు గురయ్యానని, తేరుకునేందుకు ఒక రోజు పట్టిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోటీ చేస్తే 40-50 సీట్లు కూడా రావని, అందుకనే చంద్రబాబు రాహుల్‌ను కలిశారని పేర్కొన్నారు.

శుక్రవారం అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రఘువీరా.. రాహుల్ గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు అంశాన్ని కూడా రాహుల్‌కే వదిలేస్తున్నట్టు చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా ముందుకెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రఘువీరారెడ్డి తెలిపారు.

More Telugu News