New Delhi: ప్రతి రాష్ట్రంలోనూ రైతు సమస్యలు ఉన్నాయి.. వాటిని పరిష్కరించాల్సింది ప్రభుత్వాలే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • కిసాన్ ర్యాలీకి అన్ని రాష్ట్రాల రైతులు హాజరయ్యారు
  • ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే కళ్లు తెరవాలి
  • నాయకులు, రైతులు కలిసి పరిష్కారం కనుక్కోవాలి

ప్రతి రాష్ట్రంలోనూ రైతు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఢిల్లీలో కిసాన్ ర్యాలీకి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఈ ర్యాలీకి అన్ని రాష్ట్రాల రైతులు హాజరయ్యారని చెప్పారు. పంటలు పండించే రైతు పరిస్థితి మెరుగుపడాలని, ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే కళ్లు తెరవాలని కోరారు. నాయకులు, రైతులు కలిసి ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని సూచించారు. ఆ విధంగా చేస్తే, నేటి యువతరాన్ని వ్యవసాయం వైపు తీసుకొచ్చే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.

 ఈ సందర్భంగా కౌలు రైతుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, వీరు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని రైతులుగా గుర్తించి పంట రుణాలు ఇవ్వగలిగితే వారి పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు.

More Telugu News