రోడ్డు ప్రమాదం... పాదచారితోపాటు ద్విచక్ర వాహన చోదకుని మృతి
- నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన మోటారు సైక్లిస్ట్
- ఘటనా స్థలిలోనే ఇద్దరి మృతి
- మరో వ్యక్తికి తీవ్రగాయాలు
మహమ్మద్ రియాజ్ (25), ఎన్.సతీష్ అనే వ్యక్తితో కలిసి మోటారు సైకిల్పై వెళ్తున్నారు. రైల్వేగేటు వద్దకు రాగానే బండి అదుపుతప్పి నడిచి వెళ్తున్న గార్లకు చెందిన సిరిపంగి సురేష్ (29)ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రియాజ్, సురేష్లు తీవ్ర గాయాలపాలై ప్రమాద స్థలిలోనే మరణించారని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.